గూడూరు శ్రీగురుపీఠంలో సాయినాథ విశేషపూజలు.
గూడూరు శ్రీగురుపీఠంలో సాయినాథ విశేషపూజలు.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట.సెప్టెంబర్ 18
జిల్లాలో మరో ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందిన గూడూరు శ్రీగురుపీఠంలో భక్తులు మొట్టమొదటి దత్తావదారులు శ్రీపాదవల్లభులు స్వామివారికి గురువారం అభిషేకం, అర్చనలు నిర్వహించడం జరిగినది. శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్టు పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో దివ్యమూర్తులైన శ్రీదత్తాత్రేయ స్వామి, షిరిడి సాయినాథునికి భక్తులు విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్బంగా శ్రీగురుపీఠం ట్రస్టు చైర్మన్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ శ్రీపాదవల్లభ స్వామి జననం పరమ పవిత్రమైనదని, శ్రీపాదవల్లభుల దర్శనం భాగ్యంతో పాటు రోజంతా స్వామివారి నామస్మరణ చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయని ఆయన తెలిపారు. శ్రీసాయినాథ స్తవన మంజరి పూర్తి చేసిన రోజు అయినందున భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం పూర్వ జన్మ సుకృతమని ఆయన అన్నారు.అనంతరం శ్రీగురుపీఠం ట్రస్టు తరుపున భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీగురుపీఠం ట్రస్టు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Post Comment