5 బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం
శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా .
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 17
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవపేట్ గ్రామానికి చెందిన 5 కుటుంబాలకు ఆర్థిక సహాయం దుగ్గూరు సత్యనారాయణ యాక్సిడెంట్లో కాలు తీసివేయడంతో అతని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రఘుజి ప్రశాంత్ కంపెనీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.అదే గ్రామానికి చెందిన మాజీ గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు మేకల పోచయ్య చనిపోవడంతో అతని కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇమ్రాన్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడటంతో అతని కాలు విరగడం జరిగింది . ఇమ్రాన్ ను పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. నరాల సహదేవ్ గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు అక్బర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి, మహమ్మద్ ఖాన్, వారాల గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ యువజన ఉపాధ్యక్షులు ఇసు గారి అరుణ్, మైనార్టీ నాయకులు షేక్ అలీ, కళ్యాణ్, జహంగీర్, ప్రేమ్ కుమార్, షాదుల్, షబ్బీర్, మహమ్మద్, దుర్గేష్, అజ్జు, నవీన్ చారి, ప్రశాంత్, లోకేష్, నితిన్, కొమ్ము బాబు, శ్రీను, రాజేష్, అఖిల్, నవాజ్, కరీం, కాజా పాషా, శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి




Post Comment