విశ్వ విద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి
జేఎన్టీయూహెచ్ విద్యార్థి సంఘాల నేత, తెలంగాణ అల్ యూనివర్సిటీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ డిమాండ్.
ప్రజాసింగిడి ప్రతినిధి హైదరాబాద్ఏ.ప్రిల్, 1.
విషయం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయానికి సంబంధించిన 400ఎకరాల భూమి అమ్మకాన్ని వెంటనే ఆపాలని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ డిమాండ్ చేశారు.
జగన్ మాట్లాడుతూ ప్రజ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను విద్యార్థుల అవసరాలకు, భవిష్యత్ కి కృషి చేయాలి కానీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చేస్తున్నా ప్రయతనాన్ని విరామించుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.
వేలం ఆపాలని పోరాటం చేస్తున్నా విద్యార్థి సంఘాల విద్యార్థులను అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు, వృక్ష సంపాదను కాపాడాలని, హెచ్ సి యు లో అర్థరాత్రి కూడా బుల్డజర్లతో చెట్లను కూల్చడం వల్ల అక్కడి నెమల్ల అర్థనాదలు హృదయపూర్వకంగా ఉన్నాయన్నారు.
పర్యావరణ విధ్వంసంన్ని వెంటనే అపి, హెచ్ సి యు అటవీ సంపాదను, జీవవైవిద్యాన్ని కాపాడాలని అయన రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.
హెచ్ సి యు భూములను వేలం ఆపకపోతే భారత దేశ వ్యాప్తంగా అన్ని విశ్వ విద్యాలయాలను కలుపుకొని పెద్ద ఎత్తున్న ఉద్యమం చేస్తామని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి హెచ్చరించారు




Post Comment