వన్యప్రాణుల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు అవగాహన సధస్సు
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మర్చి, 03.
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ రేంజ్ అటవీ శాఖ సిబ్బంది నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ లో పాఠశాల విద్యార్థులతో కార్యక్రమం నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు అడవి పర్యావరణ సమతౌల్యంలో వన్యప్రాణుల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే హర్బల్ గార్డెన్లో ఔషధ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దివ్య , డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధిరామ్ సింగ్ , ఎఫ్ఎస్ఓ సాయిరామ్ , ఎఫ్ఎస్ఓ కరీముద్దిన్ ఎఫ్బిఒ గోపాల్ , ఎఫ్ఎస్ఓ శ్రీధర్ ,ఎఫ్ఎస్ఓ రాజమణి, రేంజ్ సిబ్బంది మరియు అర్బన్ పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.




Post Comment