పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్
ప్రజా సింగిడి ప్రతినిధి అగస్ట్ 23 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ పట్టణ, పోలీసులు శనివారం అల్లిపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1400/- నగదు, మూడు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు మరియు 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, అల్లిపూర్ గ్రామంలోని SK ప్రిన్స్ ఫంక్షన్ హాల్ వెనుక టేకు చెట్టు కింద కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో జహీరాబాద్ టౌన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి పోలీసులు ప్రయత్నించిన వ్యక్తులను పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రిత్య చర్య ,, తదితరులు పాల్గొన్నారు
Post Comment