పాపన్న వర్ధంతిని అన్ని గ్రామాలలో నిర్వహించాలి: మురళి గౌడ్
కామారెడ్డి: పాపన్న వర్ధంతిని అన్ని గ్రామాలలో నిర్వహించాలి: మురళి గౌడ్
Praja singidi,kamareddy
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315 వ వర్ధంతిని కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలలో జరపాలని జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. చత్రపతి శివాజీ మహారాజ్ కు సమకాలికుడైన పాపన్న మహారాజ్ గోల్కొండ కోట తోపాటు తెలంగాణలోని 32 కోటలను జయించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించారని తెలిపారు. ఏప్రిల్ రెండవ తేదీన అన్ని గ్రామాలలో బహుజనులందరూ కలిసి వర్ధంతి జరపాలని పిలుపునిచ్చారు.




Post Comment