అంజన్న సన్నిధిలో కార్తీక పౌర్ణమి వేడుకలు
*అంజన్న సన్నిధిలో కార్తీక పౌర్ణమి వేడుకలు*

ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట, నవంబర్ 05
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తజన సందడి నెలకొంది
. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు అభిషేకం, ప్రత్యేక పూజలు ప్రత్యేక హారతి నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న రామాలయంలో సీతారాముల వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు ప్రత్యేక హారతి నిర్వహించారు. సత్యనారాయణ స్వామి మండపంలో భక్తులు సామూహిక వ్రతాలు ఆచరించారు. దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని ఈఓ తెలిపారు. అలాగే భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ముక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు దేవదత్తశర్మ, ప్రభుశర్మ, దేవిశ్రీ, శ్రీహర్ష శ్రీ చరణ్ శ్రీ వత్సవా ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ సిబ్బంది రామకృష్ణ. పాల్గొన్నారు.




Post Comment