సెంట్రల్ యూనివర్సిటికి చెందిన గజం భూమిని కూడా వొదిలే ప్రసక్తే లేదు..
బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాకేష్…
ప్రజా సింగిడి ప్రతినిధి ఏప్రిల్ 01 జహీరాబాద్
జహీరాబాద్,రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ లోని యునివర్సిటీ లకు చెందిన భూముల జోలికి వొస్తే ఊరుకునేది లేదు అని భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రాకేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాకేష్ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వందల ఎకరాల అటవీ ప్రాంత భూములు లోని చెట్లను నరికి వేయడానికి బుడోజర్లు తెచ్చి విద్యార్థులకు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు అట్టి యూనివర్సిటి భూములను బుల్డోజర్ ల సహకారం తో క్లీన్ చేసి భూదందకు తెరలేపింది అని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా లేక బుడోజర్ల ప్రభుత్వమా అని ఎద్దేవ చేసారు. రేవంత్ రెడ్డి తన తమ్ముళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమ తమ్ముళ్లకు యూనివర్సిటి కి చెందిన ప్రభుత్వ భూములను కట్టబెట్టాలని చూస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వ భూములను అమ్మలని చూస్తే విధ్యార్థులు చూస్తు ఊరుకోబోరని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.విద్యార్థి లోకం తో పెట్టుకున్న ఏ ప్రభుత్వము కూడా మనుగడ సాధించినా దాఖలాలు లేవని అన్నారు. విధ్యార్థులు ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధఖాండ సృష్టించి భయాందోళనకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు . పోలీసులు అక్రమ కేసులు పెట్టి విద్యార్థులను సమస్యల పై పోరాటాలను ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం లోని ఏ వర్సిటీలకు చెందినా ఒక్క గజం భూమిని కూడా విడిచి పెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి పనికి మాలిన చర్యలు మానుకుని సెంట్రల్ యూనివర్సిటి భూముల జోలికి రకూడదని ఒకవేళ ఇదే దుశ్చర్యకు పాల్పడితే బీ.ఆర్.ఎస్వీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బి.ఆర్.ఎస్వీ నాయకులు ఓంకార్ , పరశురాం , ఫయాజ్ , మారుతి యాదవ్ , రాఘు తేజ , అవెస్ , అజీమ్ , ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment