లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ: షబ్బీర్ అలీ..
ప్రజా సింగిడి, కామారెడ్డి జిల్లా:
కామారెడ్డి పట్టణంలోని జిల్లా కార్యాలయం లో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)24 చెక్కులను దాదాపు 20 లక్షల రూపాయలు లబ్దిదారులకు పంపిణి చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 24 మందికి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగింది అన్నారు.అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయి అన్నారు.పేదలకు సహాయంగా అండగా. నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు.ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తాం..ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం.రుణమాఫీ చేసి చూపించాం రైతు భరోసా అందిస్తున్నాం.మహిళలకు ఉచిత బస్సు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు.




Post Comment