ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అథ్లెట్ అగసర నందిని
ప్రజా సింగిడి ప్రతినిధి హైదరాబాద్. జూన్, 02.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని యువ అథ్లెట్ అగసర నందిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణపతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై తెలంగాణ ప్రతిష్టను చాటిచెప్పిన నందిని ని ముఖ్యమంత్రి అభినందించారు. ఇటీవల దక్షిణ కొరియా వేదికగా జరిగిన 26వ ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ అథ్లెట్ అగసర నందిని భారత్ తరఫున స్వర్ణపతకం సాధించారు.




Post Comment