ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లు
ప్రజా సింగిడి ప్రతినిధి హైదరాబాద్. జూన్, 04.
తెలంగాణ కేడర్కు చెందిన 2024 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ముఖ్యమంత్రి , బాధ్యతల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.ముఖ్యమంత్రి ని కలిసిన సౌరభ్ శర్మ , సలోని ఛబ్రా , హర్ష చౌధరి కరోలిన్ చింగ్తియన్మావి కొయ్యడ ప్రణయ్ కుమార్ లు ప్రస్తుతం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు.
జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , డి ఆర్. ఎం సీ ఆర్ హెచ్ డి ఆర్ వైస్ -ఛైర్పర్సన్ శాంతి కుమారి , కోర్సు డైరెక్టర్ ఉషారాణి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




Post Comment