మంగళవారం సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 15.
దేశంలోనే
ఎక్కడ లేని విదంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో దాతలస హకారంతో బగలాముఖీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమై, ప్రతి నిత్యం భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ బగలాముఖీ శక్తిపీఠంలో బగలాముఖీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం ఉదయం అమ్మవారికి మహాపూజలు నిర్వహించడం జరిగినది. అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మర్శి శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు, పీతవర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారికి రుద్రయామల బగలా అష్టోత్తర నామర్చనలతో హరిద్రార్చన కార్యక్రమం నిర్వహించి, అమ్మవారికి అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి, నానా విధఫలాలతో నైవేద్యం సమర్పించడం జరిగినది. తనను నమ్మిన భక్తుల ప్రతిభందకాలను తొలగించే బగలాముఖీ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి భక్తులకు కొడకంచి సుదర్శన్ గౌడ్ పులిహోర ప్రసాదం అందజేయడం జరిగినది.




Post Comment