బిడియల్ భానూర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి.
• ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి.ఏప్రిల్,4.
బిడియల్ భానూర్ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ.. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, మిస్సింగ్ పర్సన్స్ ను ట్రేస్ చేయాలని అన్నారు. ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని నియమించి, రికార్డ్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని యస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సివిల్ తగాదాలలో తలదూర్చకూడదు అన్నారు. సిబ్బంది అధికారులు 24*7 అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో కృషి చేయాలని అన్నారు. హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచాలని అన్నారు. నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు వీధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్ గురించి, రోడ్డు ప్రమాదాల గురించి జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం, బోలార్డ్స్, రాంబుల్ స్ట్రిప్స్ వేయించడం మరియు తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్ లు గుర్తించి, సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని అన్నారు. విజిబుల్ పోలిసింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ-పెట్టి కేసులు నమోదు చేయాలని యస్.హెచ్.ఒ కు పలు సూచనలు చేశారు.




Post Comment