పొక్సో, అత్యాచార కేసులలో మహిళల, బాలికల భద్రతకు “భరోసా” పెద్దపీట..
*• భరోసా 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా భరోసా కేంద్రంలో వేడుకలకు హజరైన జిల్లా ఎస్పీ
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి. మే, 07.
*• భరోసా సెంటర్ సేవలు మరువలేనివని,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
బుధవారం నాడు భరోసా 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా పరితోష్ పంకజ్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పొక్సో మరియు అత్యాచార కేసులలో భాదితురాలికి భరోసానిచ్చేందుకు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా 2016 మే 7వ తేదీన ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు పొక్సో మరియు అత్యాచారకేసులలో భాదిత మహిళల, బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటూ మన భరోసా సేవలు దేశానికే ఆదర్శం అని ఎస్పీ అభిప్రాయపడ్డారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని రకాల సేవలను ఒకే గొడుగు క్రింద అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో భరోసా కేంద్రాన్ని తేది: 28.09.2020, నాడు ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ భరోసా సెంటర్ నందు శిక్షణ పొందిన సిబ్బంది, భాదిత మహిళలను అక్కున చేర్చుకొని వారిలో కొండత ధైర్యాన్ని నింపుతూ.., సమస్యలతో భరోసా సెంటర్ కు వచ్చిన వారికి నిష్ణాతులైన కౌన్స్లర్ లచే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, అన్ని రకాల సేవలు (మెడికల్, లీగల్ మరియు కాంపెన్సేషన్) ఒకే వేదికగా అందిస్తూ, భాదితులకు బాధ నుండి విముక్తి కల్పిస్తూ సత్వర న్యాయం చేకూరేలా సేవలందిస్తున్న భరోసా సిబ్బంది సేవలు అభినందనియమని వారి సేవలను కొనియాడారు.
భరోసా సెంటర్ ద్వారా పోక్సో మరియు మహిళల పై అత్యాచార కేసులను నియంత్రించడానికి స్కూల్, కళాశాల లలో తరుచూ అవగాహన (prevention of child sexual abuse) కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోక్సో కేసు నమోదు అయినప్పటి నుండి చివరి వరకు బాధితులకు అండగా వుంటూ, నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే భరోసా ముఖ్య ఉద్ధేశ్యం అన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు నమోదు చేయాలని, న్యాయస్థానం ముందు దోషులకు శిక్ష పడినప్పుడే తిరిగి నేరం చేయడానికి వెనకడుగు వేస్తారని అన్నారు.భాదిత మహిళలకు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ క్రింద ఒక్కొక్కరికి రూ: 5వేల చొప్పున, 20 వేల చెక్కులను అందించడం జరిగిందని ఎస్పీ అన్నారు. భరోసా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, రాత్రి పగలు అని తేడా లేకుండా ఎళ్లవేలలా పిల్లల, మహిళల రక్షణకు అందుబాటులో ఉండాలని సూచించారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా అన్ని శాఖల అధికారులతో కో-ఆర్డినేషన్ తో విధులు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో భరోసా సెంటర్ ప్రారంభమైన నాటి నుండి సత్ ఫలితాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న భరోసా కో-ఆర్డినేటర్ దేవలక్ష్మీ, సిబ్బందిని, ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ తొ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రమీల, ఎస్ఐ పూలబాయ్, భరోసా సిబ్బంది తదితరులు ఉన్నారు.




Post Comment