పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 14.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 సంవత్సరం కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం
ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భం
గురువులతో పూర్వ విద్యార్థులు దొంతిలోని జీవన్ దివ్య ఫంక్షన్ హాల్ లో అందరూ కలుసుకొని అప్పటి గురువులను సన్మానించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో
పాటు యోగక్షేమాల గురించి చర్చించుకున్నారు.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇన్ని రోజులకు చదువు చెప్పిన విద్యార్థులను కలిసి వారి యోగ క్షేమలను తెలుసుకోవటం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పి ఈ టి చంద్ర మోహన్, ప్రమీల, సౌభాగ్య, కృష్ణవేణి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు




Post Comment