×

నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..,

ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి . మే ,02.

• సెక్షన్ 144/ 163 BNSS అమలు..
• అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పొందుపరిచిన నియమ నిబంధనలను తప్పక పాటించాలి..
• అత్యవసర సమయాలలో జిల్లా కంట్రోల్ నెంబర్ 8712656739 కు కాల్ చేయండి..
• జిల్లా పోలీసు అధికారులతో నీట్ పరీక్ష బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ (యూ.జి) పరీక్ష దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వివరించారు. మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్ష కేంద్రంలోనికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్, /(144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు, గుంపులుగా తిరగడానికి వీలులేదని, 100 మీటర్స్ వపల ఉన్న అన్నీ జిరాక్స్ షాప్ మూసివేయాలన్నారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్స్ ఎవ్వరూ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకొని వెళ్లరాదన్నారు. అన్నీ పరీక్ష కేంద్రాలు సిసి కెమెరాల పర్యాయవేక్షణలో ఉంటాయన్నారు. సంబంధిత పోలీస్ అధికారులు ప్రతి ఒక్క అభ్యర్ధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలని, పరీక్షా సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అభ్యర్థులకు పరీక్షా కేంద్రానికి చేరుకునే సమయంలో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నట్లైతే వెంటనే జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 కు సమాచారం అందించాలని, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఆదివారం ఉదయం నుండే పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని అన్నారు.

అభ్యర్థులకు సూచనలు:
అభ్యర్థులు అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డు, 2- పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, 1- పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకొని రావాలని అన్నారు.
అభ్యర్థులు, ఇన్విజిలేటర్లల యొక్క ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకూడదని తెలియజేశారు.
షూస్, సాక్స్, బెల్ట్, బంగారు,వెండి, ఇతర ఆభరణాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవని, ఇవి లేకుండా అభ్యర్థులు పరీక్షకు రావాలని సూచించారు.
ఫుల్ షర్ట్స్ కి అనుమతి లేదని, హాఫ్ హ్యాండ్ షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి. ట్రాన్స్పరెంట్/ పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
అడ్మిట్ కార్డ్ నందున్న సూచనలు పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరు కావాలని జిల్లా ఎస్పీ  అభ్యర్థులు సూచనలు చేశారు.

ఈ సమీక్షలో అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్, సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, ఎ.ఆర్ డియస్పీ నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్, ఆర్.ఐ లు రామ రావ్, డానియెల్ తదితరులు ఉన్నారు.

 

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!