ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 10
మెదక్ జిల్లా మండలంలోని పాతూరులో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు ఆయా కేంద్రాల్లో వసతులను పరిశీలించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఐకెపి కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు ప్యాడి క్లీనర్ మిషన్లో వడ్లు పోసి శుభ్రపరిచారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు దళారులకు అడ్డుకట్ట వేసేందుకు రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈసారి ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు జిల్లాలో రబీ సీజన్ కు గాను 480 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్స్ అందుబాటులో ఉంచామని రైతులు తమ ధాన్యాన్ని తాలు తప్ప లేకుండా ప్యాడి క్లీనర్ల ద్వారా శుభ్రపరచుకుని తేమ శాతం 17 ఉండేలా చూసుకుని విక్రయించిన ఎడల మద్దతు ధర లభిస్తుందని సూచించారు తక్కువ సమయం లో ధాన్యం డాడీ క్లీనర్స్ ద్వారా శుభ్రం చేయవచ్చని క్షేత్రస్థాయిలో స్వయంగా తెలుసుకోవడం జరిగిందని రైతులు ఇట్టి విషయాన్ని కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ధాన్యాన్ని శుభ్రపరుచుకోవాలి అన్నారు ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ 2320 సాధారణ రకానికి రూ 2300 నిర్ణయించినందని వెల్లడించారు జిల్లాలోని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు తాసిల్దార్ లక్ష్మణ్ బాబు ఐకెపి మహిళలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment