ఐడిఏ పాశమైలారం లోని ” బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ” పరిశ్రమల్లో “సిఐటియు యూనియన్” ఏర్పాటు..*
–
బిస్లెరి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు గా అతిమేల మాణిక్*
*కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతర కృషి*
*- బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్*
ప్రజాసింగిడి ప్రతినిధి పాశమైలారం అక్టోబర్ 30
ఐడిఏ పాశమైలారంలోని బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు..
పటాన్చెరువు శ్రామిక్ భవన్లో జరిగిన బిస్లెరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికుల సమావేశానికి ముఖ్యఅతిథిగా అతిమేల మాణిక్ హాజరై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య యుతంగా ఐడిఏ పాశమైలారం ఫేస్ – 3 లో గల ” బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ” పరిశ్రమలో కార్మికులు అందరూ ఐక్యంగా సిఐటియు అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారని, కార్మికులందరికీ సిఐటియు అభినందనలు తెలియజేస్తుందని అన్నారు. కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. యూనియన్ ఏర్పాు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతపర్చి యాజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగిందని అన్నారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించి త్వరలోనే యూనియన్ ఇంట్రడక్షన్ జాయింట్ మీటింగ్ ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. యాజమాన్యం యూనియన్ కు సహకరించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. యూనియన్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని రిజిస్ట్రేషన్ కాఫీ జతచేస్తూ కార్మిక శాఖ అధికారులు డిప్యూటీ లేబర్ కమిషనర్, జాయింట్ లేబర్ కమిషనర్, సిఐ భానూర్, డీఎస్పీ పటాన్చెరువు కి లెటర్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కృషికి సహకరించాలని అన్నారు.
సమావేశంలో సిఐటియు పటాన్చెరువు ఏరియా నాయకులు బి నాగేశ్వరరావు ఐడిఏ పాశమైలారం క్లస్టర్ నాయకులు రాజు బిస్లెరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ఎన్.శేఖర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రెటరీ అజయ్ ఠాకూర్, కోశాధికారి నవీన్ కమిటీ సభ్యులు రాము నాయక్ అమిత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు




Post Comment